ఆ పార్టీనే గెలిపించాలి: మంత్రి లోకేశ్ పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-09 13:15:33  IST  )

ప్రస్తుతం బిహార్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది..

ఆ పార్టీనే గెలిపించాలి: మంత్రి లోకేశ్ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం బిహార్‌(Bihar)లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే తొలిదశ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇప్పుడు రెండో దశకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి లోకేశ్(Ap Minister Lokesh) బిహార్‌లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే బిహార్ అభివృద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు. నితీశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిహార్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. బిహార్, ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించారని తెలిపారు. అభివృద్ది జరగాలంటే ఎన్డీయే కూటమిని గెలిపించాలని మంత్రి లోకేశ్ కోరారు.

READ MORE .....

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు మంత్రి లోకేష్ అభినందనలు

Next Story